Monday, May 20, 2024
Homeసినిమామ‌ళ్లీ సెట్స్ పైకి వ‌స్తున్న‌ వీర‌మ‌ల్లు

మ‌ళ్లీ సెట్స్ పైకి వ‌స్తున్న‌ వీర‌మ‌ల్లు

Back in Action: ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న భారీ బ‌డ్జెట్ మూవీ ‘హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు‘. క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నఈ  చిత్రాన్ని  సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ ఏఎం ర‌త్నం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. ఇందులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర‌స‌న ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగ‌ర్వాల్ న‌టిస్తుంది. అయితే.. ఈ మూవీని ఎప్పుడో స్టార్ట్ చేశారు కానీ.. కొన్ని కార‌ణాల వ‌ల‌న ఇంకా షూటింగ్ కంప్లీట్ కాలేదు. ప‌వ‌న్ రాజ‌కీయాల్లో బిజీ అవ్వ‌డం వ‌ల‌న మ‌రింత ఆల‌స్యం అయ్యింది.

ద‌స‌రా త‌ర్వాత నుంచి ప‌వ‌న్ ఏపీలో ప‌ర్య‌టించ‌నున్నారు. అందుచేత అక్టోబ‌ర్ లోపు ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేయ‌మ‌ని డైరెక్ట‌ర్ క్రిష్‌, ప్రొడ్యూస‌ర్ ఏఎంర‌త్నంకు చెప్పార‌ట‌. ఇదిలా ఉంటే.. ప‌వ‌న్ పాలిటిక్స్ లో బిజీ కావ‌డం.. వేరే రీమేక్ లో న‌టించేందుకు ఓకే చెప్ప‌డంతో వీర‌మ‌ల్లు మూవీ ఆగిపోయిందని… ఇక ఉండ‌క‌పోవ‌చ్చు అని ప్ర‌చారం జ‌రిగింది. వీర‌మ‌ల్లు టీమ్ కూడా ప్రచారంలో ఉన్న వార్త‌లపై స్పందించ‌క‌పోవ‌డంతో అంతా నిజ‌మే అనుకున్నారు.

లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే… ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఆగస్టు 11 నుంచి స్టార్ట్ చేయాలని క్రిష్ ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఈ కొత్త షెడ్యూల్ లో పవన్ పై ఓ సాంగ్ ను షూట్ చేయబోతున్నారు. సాంగ్ అనంతరం పవన్ కళ్యాణ్ పార్ట్ కి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి చేస్తారట. మొఘల్ కాలం నాటి ఫిక్షన్ కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ప‌వ‌న్ న‌టిస్తున్న ఫ‌స్ట్ పాన్ ఇండియా మూవీ కావ‌డంతో భారీ అంచ‌నాలు ఉన్నాయి.

Also Read : హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు న్యూ టార్గెట్ ఇదే 

RELATED ARTICLES

Most Popular

న్యూస్