Wednesday, March 26, 2025
HomeTrending Newsప్రగతిభవన్ లో విజయ దశమి వేడుకలు

ప్రగతిభవన్ లో విజయ దశమి వేడుకలు

విజయ దశమి సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లోని నల్ల పోచమ్మ అమ్మవారి దేవాలయంలో కుటుంబ సమేతంగా అమ్మవారికి పూజలు నిర్వహించారు. సాంప్రదాయ బద్దంగా వాహన పూజ, ఆయుధ పూజ ఘనంగా నిర్వహించారు. దసరా సందర్భంగా జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సీఎం సతీమణి శోభమ్మ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శైలిమ దంపతులు, సీఎం కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, తదితర కుటుంబ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్