Monday, May 20, 2024
HomeTrending NewsSupreme Court: తెలంగాణకు వివేకా హత్య కేసు

Supreme Court: తెలంగాణకు వివేకా హత్య కేసు

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసు విచారణ తెలంగాణ రాష్ట్రానికి బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. దీనిపై వివేకా కుమార్తె  డా. సునీత దాఖలు చేసిన  పిటిషన్‌పై విచారించిన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ లో ఉంచిన సంగతి తెలిసిందే.  నేటి ఉదయం తీర్పును సర్వోన్నత న్యాయస్థానం వెలువరించింది. కేసును ఏపీ నుంచి  హైదరాబాద్ సీబీఐ స్పెషల్ కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు  ధర్మాసనం వెల్లడించింది.

నేర విచారణ నిష్పాక్షికంగా జరపడం కోసమే విచారణ బదిలీ చేస్తున్నట్లు  జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్