Sunday, September 8, 2024
HomeTrending Newsరాష్ట్రపతికి ఘనస్వాగతం

రాష్ట్రపతికి ఘనస్వాగతం

రెండ్రోజుల పర్యటన కోసం భారత రాష్త్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న రాష్ట్రపతికి  రాష్ట్ర గవర్నర్ విశ్వ భూషణ్ హరి చందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి జి. కిషన్ రెడ్డి, విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి, చీఫ్ సెక్రటరీ, డిజిపి తదితరులు ఘన స్వాగతం పలికారు.

అనంతరం ఆమె పోరంకి మురళి ఫార్చ్యూన్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన పౌర సన్మానం కార్యక్రమంలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్