Friday, September 20, 2024
HomeTrending Newsబాబు ధీమా: కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వాలే

బాబు ధీమా: కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వాలే

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ధీమా వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వారణాసి చేరుకున్న బాబు మీడియాతో మాట్లాడారు. వారణాసి ఓ పవిత్ర దేశమని, మోడీ నామినేషన్ ఓ చారిత్రిక సంఘటన అని బాబు అభివర్ణించారు. పదేళ్లుగా ఆయన దేశానికి విశేషమైన సేవలు అందిస్తున్నారని కొనియాడారు.

దేశ వ్యాప్తంగా ఎన్డీయే కూటమి ఘనవిజయం సాధిస్తుందని, 400సీట్లు గెలుస్తుందని బాబు జోస్యం చెప్పారు. మోడీ మూడసారి ప్రధాన మంత్రి అవుతారని, విశ్వవ్యాప్తంగా భారత్, భారతీయులు కీలక పాత్ర పోషించబోతుందని చెప్పారు. 2047నాటికి వికసిత భారత్ లక్ష్యంగా మోడీ పనిచేస్తున్నారని కితాబిచ్చారు.  కాగా, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సతీ సమేతంగా నిన్న సాయంత్రమే వారణాసి చేరుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్