నరేశ్, ఆలీలతో పాటు మెట్రోట్రైన్ ముఖ్య భూమిక పోషించిన కంటెంట్ ఓరియొంటెడ్ చిత్రం ‘‘అందరూ బావుండాలి అందులో నేనుండాలి’. గత ఏడాది ఓటిటి నెట్ఫ్లిక్స్ లో విడుదలై సంచలన విజయం నమోదు చేసుకున్న ‘వికృతి’ అనే మలయాళ చిత్రానికి రీమేక్గా ఇది తెరకెక్కింది. చక్కని మెసేజ్తో పాటు ఫుల్ ఎంటర్టైన్మెంట్ విత్ కమర్షియల్ ఎలిమెంట్స్తో వస్తున్న ఈ చిత్రం అందరిని ఆలోచింపజేస్తుంది. సోషల్ మీడియాలో అత్యుత్సాహం ప్రదర్శించే కొందరివల్ల అమాయకులకు ఎటువంటి ఇబ్బంది కలుగుతుంది అనే కథాంశంతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. అలీవుడ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఆలీ సమర్పణలో శ్రీపురం కిరణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అలీబాబా, కొణతాల మోహన్, శ్రీచరణ్లు సంయుక్తంగా నిర్మించారు. నటునిగా ఆలీ దాదాపు 1100 చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. సంగీత దర్శకుడు ఏ.ఆర్ రెహమాన్ దగ్గర అసిస్టెంట్గా పనిచేసిన రాకేశ్ పళిదంను ఈ సినిమా ద్వారా సంగీత దర్శకునిగా పరిచయం చేస్తున్నారు.
ఈ చిత్రం సెన్సార్ పూర్తయిన సందర్భంగా నటుడు, చిత్ర నిర్మాత ఆలీ మాట్లాడుతూ..‘ మా సినిమా ‘‘అందరూ బావుండాలి అందులో నేనుండాలి’’ చిత్రానికి క్లీన్ యు సర్టిఫికెట్ పొందటం ఎంతో ఆనందంగా ఉంది. సినిమా చూసిన ఐదుగురు సభ్యుల బృందం నాతోపాటు మా టీమ్తో మాట్లాడుతూ చాలాకాలం తర్వాత ఒక మంచి సినిమాని చూశాం అని ప్రశంసిస్తుంటే మేము పడిన కష్టం అంతా ఒక్కసారిగా ఎగిరిపోయింది. నేను ఏ పనిచేసినా ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేస్తాను. సెన్సార్ వారి ప్రశంసల తర్వాత ఈ సినిమా చేసే విషయంలో నా డెసిషన్ కరెక్టే అని అర్థమయింది. సూపర్స్టార్ కృష్ణగారు, ప్రభాస్, సోనూసుద్, సమంత మా సినిమా ప్రమోషన్లో పాలు పంచుకుని నన్ను ఆశీర్వదించినందుకు వారికి నా ధన్యవాదాలు. త్వరలోనే సినిమా ట్రైలర్ను టాలీవుడ్లోని ఓ ప్రముఖ హీరోతో విడుదల చేయిస్తాము. అక్కడే సినిమా విడుదల తేదిని కూడా ప్రకటిస్తాను’’ అన్నారు.
నిర్మాతల్లో ఒకరైన మోహన్ కొణతాల మాట్లాడుతూ.. ఆలీగారు నాకు గత 20 ఏళ్లుగా తెలుసు. ఎన్నోసార్లు నేను మీతో సినిమా చేస్తాను అన్నయ్య అనేవాణ్ని. ఆలీగారు నేను చెప్పినప్పుడు సినిమా చేద్దువుగాని అని ఇన్నిరోజులు వెయిట్ చేయించారు. ఆలీ అన్న ఇన్ని రోజులు ఎందుకు ఆగమన్నారో సినిమా చూసిన తర్వాత నాకిప్పుడు అర్థమయ్యింది. ఇంత గొప్పసినిమా తీసే అవకాశం వచ్చినందుకు హ్యాపీగా ఫీలవుతున్నా’’ అన్నారు.
పవిత్ర లోకేశ్, మంజుభార్గవి, తనికెళ్ల భరణి, ఎల్బీ శ్రీరాం, మనో, గౌతంరాజు, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, ప్రణవి మానుకొండ , సప్తగిరి, పృధ్వీ, రామ్జగన్, ముక్తార్ ఖాన్, భద్రం, లాస్య, సనా, వివేక్, శివారెడ్డి, సింగర్ మధు, గీతాసింగ్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి చీఫ్ క్రియేటివ్ హెడ్– ఇర్ఫాన్, కో డైరెక్టర్– ప్రణవానంద్ కెమెరా– ఎస్ మురళీమోహన్ రెడ్డి, ఆర్ట్– కెవి రమణ, డాన్స్ డైరెక్టర్– స్వర్ణ, ఎడిటర్– సెల్వకుమార్, ఫైట్స్–నందు, మేకప్–నంద్యాల గంగాధర్, ప్రొడక్షన్ కంట్రోలర్– సయ్యద్ తాజ్ బాషా, విఎఫ్ఎక్స్– మాయాబజార్ స్టూడియో