మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో ఓ భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని ప్రొడ్యూసర్ దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ నటిస్తుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ షూటింగ్ కి ప్రస్తుతానికి బ్రేక్ పడింది. త్వరలో లేటెస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నారు.
వైజాగ్, హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ భారీ సినిమా తర్వాత చరణ్ జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో సినిమా చేయనున్నాడని గతంలో అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాని భారీ చిత్రాల నిర్మాత ఎన్వీ ప్రసాద్ నిర్మించనున్నట్టుగా అనౌన్స్ చేశారు. అయితే.. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందని గట్టిగా వార్తలు వచ్చాయి. జెర్సీ సినిమాను హిందీలో గౌతమ్ రీమేక్ చేశాడు. ఆ సినిమా ప్లాప్ అయ్యింది.
దీంతో ఇప్పుడు గౌతమ్ తో సినిమా చేస్తే.. క్రేజ్ రాదని.. ఈ ప్రాజెక్ట్ ని చరణ్ క్యాన్సిల్ చేశారని ప్రచారం జరుగుతుంది. ఇంతకీ విషయం ఏంటంటే… ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ కాలేదట. అలాగని ఇప్పటికిప్పుడు ఈ సినిమా సెట్స్ పైకి రాదట. కాకపోతే కాస్త టైమ్ పడుతుందని తెలిసింది. దీంతో గౌతమ్ అప్పటి వరకు ఈ కథ పై కసరత్తు చేస్తారా..? లేక వేరే కథతో వేరే హీరోతో సినిమా చేస్తారా..? అనేది ఆసక్తిగా మారింది.
Also Read : చరణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్