Monday, September 30, 2024
Homeసినిమామైత్రీ నిర్మాతల పై చిరు కోపం..?

మైత్రీ నిర్మాతల పై చిరు కోపం..?

చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య‘.రవితేజ కీలక పాత్ర పోషించారు. బాబీ దర్శకత్వం వహించారు. చిరంజీవికి జంటగా శృతి హాసన్ నటిస్తే.. రవితేజకు జంటగా కేథరిన్ నటించింది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ అదిరిపోయే మ్యూజిక్ అందించారు. టీజర్, సాంగ్స్ అండ్ ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో వాల్తేరు వీరయ్య మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మధ్య కాలంలో చిరంజీవి నటించిన ఏ సినిమాకి రానంత బజ్ ఈ సినిమాకి వచ్చింది.

అయితే.. ఈ సినిమాను భారీ చిత్రాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. ఇందులో ‘బాస్ పార్టీ’ అనే సాంగ్ ఉంది. ఈ ఒక్క పాట కోసం అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రత్యేకంగా సెట్ వేశారు. కోట్లు ఖర్చు పెట్టి మరీ ఈ సెట్ వేశారు. అయితే.. ఈ సెట్ ను పాటకు తప్పా అంతగా ఉపయోగించలేదు. ఈ సెట్ చూసిన తర్వాత బాగా వేశారని అభినందించిన చిరంజీవి ఒక్క పాట కోసం ఇంత ఖర్చు పెట్టి సెట్ వేయడం అవసరమా..? ఎందుకు ఇంతలా వేస్ట్ చేస్తున్నారు అని నిర్మాతల పై చిరు కోపం చూపించారట. ఈ వార్త బయటకు వచ్చింది.

ఇదే విషయం గురించి చిరంజీవిని అడిగితే… బాస్ పార్టీ సెట్ కోసం మైత్రి వారు భారీ మొత్తాన్ని ఖర్చు పెట్టారని.. ఆ సెట్ వేసే ముందే టీం తనతో చర్చించి ఉంటే తాను వద్దనేవాడినని అన్నారు. అయితే ఈ పాట సెట్ ఈ సెట్ లో తీయడం వలన సాంగ్ వావ్ అనిపించేలా వచ్చిందని అన్నారు చిరంజీవి. మూవీ మేకింగ్ లో నిర్మాతలు చాలా జాగ్రత్తగా ఉండాలని.. దర్శకులు కూడా సినిమాను బాగా వచ్చేలా చేసుకోవాలని అన్నారు. ఈ విధంగా సెట్ గురించి.. బడ్జెట్ ఎక్కువ అవుతుందని నిర్మాతల పై కాస్త సీరియస్ అయ్యారట కానీ.. అంతకు మించి ఏమీ లేదట.

RELATED ARTICLES

Most Popular

న్యూస్