Sunday, September 8, 2024
Homeసినిమాఅభిమానులకు సారీ చెప్పిన నిఖిల్.

అభిమానులకు సారీ చెప్పిన నిఖిల్.

నిఖిల్ కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాడు. ఇప్పుడు ‘స్పై’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాతో కూడా పాన్ ఇండియా రేంజ్ లో విజయం సాధించాలి అనుకున్నాడు. ఈ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయనున్నామని ప్రకటించాడు. అయితే.. పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయాలంటే ప్రమోషన్స్ కు టైమ్ కావాలని నిర్మాతకు చెప్పి సినిమాను వాయిదా వేద్దామని అడిగితే.. నో చెప్పారట. ఈ విషయమై ఇద్దరికీ డిఫరెన్సస్ వచ్చాయని వార్తలు వచ్చాయి.

అయితే… నిర్మాత రాజశేఖర్ రెడ్డి అనుకున్నట్టుగానే జూన్ 29న స్పై చిత్రాన్ని విడుదల చేశారు. ఈ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చింది. పలు భాషల్లో సమయానికి రిలీజ్ కూడా కాలేకపోయింది. దీని పై స్పందించిన నిఖిల్ అభిమానులకు సారీ చెప్పాడు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకుంటానని తెలిపాడు. ఈ మేరకు ట్విట్టర్ లో ఓ లెటర్ పోస్ట్ చేశాడు. ఈ చిత్రాన్ని వివిధ భాషల్లో సరిగ్గా విడుదల చేయలేకపోయామని మీ అందరికీ తెలియజేయడం నాకు చాలా బాధ కలిగిస్తోందని… ఈ కారణంగానే విదేశాల్లో 350 తెలుగు ప్రీమియర్ షోలు కూడా రద్దయ్యాయని చెప్పాడు.

దీనికి హిందీ, కన్నడ, తమిళ, మలయాళ ప్రేక్షకులందరికీ క్షమాపణలు చెబుతున్నాను. తదుపరి రాబోయే 3 చిత్రాలు అన్ని భాషల్లో థియేటర్లలో పక్కాగా అనుకున్న సమయానికి విడుదల అవుతాయని… ఇక పై క్వాలిటీ విషయంలో ఎప్పటికీ కాంప్రమైజ్ కానని నా పై నమ్మకం ఉంచే ప్రతి తెలుగు సినిమా ప్రేమికుడికి నేను మాటిస్తున్నాను అన్నాడు నిఖిల్. ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినా అంతా పూర్తి చేసి, క్వాలిటీ చెక్ చేసి, అద్భుతమైన ప్రొడక్ట్ ను ముందుకు తెస్తాను అని నిఖిల్ తెలియచేశాడు. నిఖిల్ ఇలా స్పందించడంతో మరోసారి హీరో, ప్రొడ్యూసర్ మధ్య విభేదాలు వచ్చాయి అనేది మరోసారి వార్తల్లోకి వచ్చింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్