Sunday, September 29, 2024
Homeస్పోర్ట్స్బంగ్లాపై ఇండియా విజయం; సెమీస్ కు చేరువ

బంగ్లాపై ఇండియా విజయం; సెమీస్ కు చేరువ

టి 20 వరల్డ్ కప్ లో ఇండియా దాదాపు సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. సూపర్ 8 లో భాగంగా నేడు జరిగిన రెండో మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై 50 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేయగా…. బంగ్లాదేశ్ 8 వికెట్లు కోల్పోయి 146 పరుగులే చేయగలిగింది.

భారత బ్యాట్స్ మెన్..హార్దిక్ పాండ్యా-50; విరాట్ కోహ్లీ-37; రిషభ్ పంత్-36; శివమ్ దూబే-34 పరుగులతో రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో రిషాద్ హోస్సేన్, టాంజిమ్ హసన్ షకీబ్ చెరో 2; షకీబ్ అల్ హసన్ ఒక వికెట్ సాధించారు.

లక్ష్య సాధనలో బంగ్లా తొలి వికెట్ కు 35 పరుగులు చేసింది. జట్టులో కెప్టెన్ జజ్ముల్ శాంటో 40; రిషాద్ హోస్సేన్-24; టాంజిద్ హాసన్-29 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో కులదీప్ యాదవ్ 3; బుమ్రా, అర్ష్ దీప్ సింగ్ చెరో 2; హార్దిక్ పాండ్యా ఒక వికెట్ పడగొట్టారు.

50 పరుగులతో పాటు ఒక వికెట్ పడగొట్టిన హార్దిక్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.

ఇండియా తన చివరి సూపర్ 8 మ్యాచ్ ను ఆస్ట్రేలియా తో ఈనెల 24 న ఆడబోతోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్