Thursday, April 18, 2024
Homeస్పోర్ట్స్శ్రీకాంత్ ఔట్,  మహిళల జోడీ విజయం

శ్రీకాంత్ ఔట్,  మహిళల జోడీ విజయం

BWT: Win for Women Doubles:
బ్యాడ్మింటన్ వరల్డ్ టూర్ ఫైనల్స్-2001 లో భారత ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ నిరాశ పరిచాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో నేడు జరిగిన మూడో మ్యాచ్ లో మలేషియా ఆటగాడు లీ జీ జియా చేతిలో 21-19; 21-14 తేడాతో ఓటమి పాలై  టోర్నీ నుంచి నిష్క్రమించాడు. మొదటి మ్యాచ్ లో ఫ్రాన్స్ ఆటగాడు తోమ జూనియర్ పోపోవ్ పై 21-14, 21-16 తేడాతో విజయం సాధించిన శ్రీకాంత్  నిన్న రెండో మ్యాచ్ లో థాయిలాండ్ ఆటగాడు కున్లావుత్ విటిడ్ సర్న్ చేతిలో 21-18, 21-7 తేడాతో ఓటమి పాలయ్యాడు. నేడు మూడో మ్యాచ్ లోనూ ఓటమి పాలు కావడంతో కిడంబి శ్రీకాంత్ వెనుదిరగాల్సి వచ్చింది.

మరో వైపు, ఇప్పటికే రెండు ఓటములతో టోర్నీ నుంచి వైదొలిగిన మహిళల జోడీ అశ్విని పోన్నప్ప- సిక్కీ రెడ్డిలు మూడో మ్యాచ్ లో విజయం సాధించి ఊరట ఇచ్చారు.  నేడు జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ ద్వయం క్లో బిర్చ్-లారెన్ స్మిత్ పై 21-19, 9-21, 21-14 తో విజయం సాధించారు.  పురుషుల డబుల్స్ లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగిన సంగతి విదితమే.

ఇక భారత్ ఆశలన్నీ మహిళల సింగల్ లో పివి సింధు, పురుషుల సింగిల్స్ లో లక్ష్య సేన్ ల పైనే ఉన్నాయి.

Also Read : సెమీస్ లో అడుగుపెట్టిన సింధు

RELATED ARTICLES

Most Popular

న్యూస్