Tuesday, September 17, 2024
Homeసినిమాకేటీఆర్ గెస్ట్ గా భీమ్లా నాయ‌క్ ప్రీ రిలీజ్

కేటీఆర్ గెస్ట్ గా భీమ్లా నాయ‌క్ ప్రీ రిలీజ్

KTR-PK: ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, క్రేజీ హీరో రానా ద‌గ్గుబాటి కాంబినేష‌న్లో రూపొందిన భారీ మ‌ల్టీస్టార‌ర్ మూవీ భీమ్లా నాయ‌క్. యంగ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ సాగ‌ర్ కె చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన భీమ్లా నాయ‌క్ అన్ని అడ్డంకుల‌ను దాటుకుని ఫిబ్ర‌వ‌రి 25న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. అయితే…ఈ నెల 21న హైద‌రాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ స్థాయిలో నిర్వ‌హించేందుకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.

అయితే.. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముందుగా సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు గెస్ట్ రానున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఆత‌ర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ లు ఎవ‌రూ లేకుండా కేవ‌లం భీమ్లా నాయ‌క్ టీమ్ మెంబ‌ర్స్ స‌మ‌క్షంలోనే చేయాలి అనుకుంటున్న‌ట్లుగా టాక్ వ‌చ్చింది. తాజా వార్త ఏంటంటే.. తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్.. భీమ్లా నాయ‌క్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా రానున్నారని నిర్మాణ సంస్థ అఫిషియ‌ల్ గా అనౌన్స్ చేసింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్