Wednesday, September 25, 2024
HomeTrending News'నాడు-నేడు' కు లార్స్ ల్యాబ్స్ 4 కోట్ల విరాళం

‘నాడు-నేడు’ కు లార్స్ ల్యాబ్స్ 4 కోట్ల విరాళం

ఆంధ్రప్రదేశ్‌ లో విద్యా మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి  ప్రభుత్వం చేపట్టిన ‘నాడు – నేడు‘ కార్యక్రమానికి బయోటెక్‌ కంపెనీ లారస్‌ ల్యాబ్స్‌ ,రూ. 4 కోట్ల విరాళం అందజేసింది,. దీనితో పాటు పారిశ్రామిక ప్రాంతం అనకాపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక అధునాతనమైన  సౌకర్యాలతో కూడిన కాలిన గాయాలకు సంబంధించి ఒక ప్రత్యేక వార్డు నిర్మాణానికి కూడా 5 కోట్ల రూపాయలు అందిస్తామని కంపెనీ వ్యవస్థాపకుడు సి.ఈ.ఓ డా. సత్యనారాయణ చావా సిఎం జగన్ కు హామీ ఇచ్చారు.

నేడు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో లారస్‌ ల్యాబ్స్‌ లిమిటెడ్  ప్రతినిధి బృందం సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలుసుకున్నారు. నాడు – నేడు పథకానికి లారస్‌ ల్యాబ్స్‌ విరాళాన్ని అందించడం ఇది మూడవసారి.

సిఎంను కలిసిన వారిలో డా. సత్యనారాయణ చావాతో పాటు కార్పొరేట్‌ డెవలప్‌మెంట్, సింథసిస్‌ -ఇంగ్రిడియంట్స్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కృష్ణచైతన్య చావా, మానవ వనరుల సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ నరసింహారావు చావా, సీఎస్‌ఆర్‌ హెడ్‌ సౌమ్య చావా తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్