Tuesday, September 17, 2024
Homeసినిమా'భోళా శంకర్' గురించి మహేష్ ఏమన్నాడో తెలుసా..?

‘భోళా శంకర్’ గురించి మహేష్ ఏమన్నాడో తెలుసా..?

చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘భోళా శంకర్’. ఈ చిత్రానికి మెహర్ రమేష్‌ డైరెక్టర్. వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత చిరు నుంచి వస్తున్న మూవీ కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇందులో చిరుకు జంటగా తమన్నా నటిస్తుంటే.. చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తుంది. సుశాంత్ కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం. ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఆగష్టు 11న భోళా శంకర్ మూవీ భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది.

ఇటీవల ఈ మూవీ నుంచి టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ కు అనూహ్య స్పందన వచ్చింది. అయితే.. ఈ మూవీ టీజర్ చూసిన మహేష్‌ బాబు చాలా బాగుంది అంటూ అభినందించారట. ఈ విషయాన్ని స్వయంగా చిత్ర దర్శకుడు మెహర్ రమేష్ తెలియజేశారు. సినిమా ప్రమోషన్ లో భాగంగా దర్శకుడు మెహర్ రమేష్ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం బయటపెట్టారు. భోళా శంకర్ టీజర్ చూసి మహేష్ బాబు ఫోన్ చేశారు. టీజర్ పై తన ఆసక్తిని తెలియజేశారు. అంతే కాకుండా టీజర్ లో మహతి స్వరసాగర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని ప్రశంసించారు అంటూ మెహర్ రమేష్ తన సంతోషాన్ని షేర్ చేసుకున్నాడు.

మహేష్ బాబుకు టీజర్ ను నచ్చడంతో విడుదలైన తర్వాత చూసే అవకాశాలు కూడా ఉన్నాయి. మహేష్, మెహర్ రమేష్.. ఇద్దరూ కలిసి బాబీ సినిమాలో నటించారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. ఆ కారణంగానే టీజర్ గురించి స్పందించారు. ఇక మెహర్ రమేష్ గత కొంతకాలంగా సరైన సక్సెస్ లేని కారణంగా కెరీర్ లో చాలా గ్యాప్ వచ్చింది. ఈ సినిమా కనుక సక్సెస్ అయితే.. మెహర్ రమేష్ కు మరిన్ని సినిమాలు చేసే ఛాన్స్ వస్తుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్