Wednesday, October 2, 2024
Homeసినిమామహేష్‌, త్రివిక్రమ్ మూవీ ఆగిపోయిందా..?

మహేష్‌, త్రివిక్రమ్ మూవీ ఆగిపోయిందా..?

మహేష్‌ బాబు, త్రివిక్రమ్ వీరిద్దరి కాంబినేషన్లో ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాలు రూపొందడం.. ఈ రెండు చిత్రాలు మంచి విజయం సాధించడం తెలిసిందే. అయితే.. ఈ రెండు చిత్రాలు వెండితెర మీద కన్నా బుల్లితెర పై బాగా సక్సెస్ అయ్యాయి. వీరిద్దరూ కలిసి మరో సినిమా చేస్తే బాగుంటుందని అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. ఇన్నాళ్లకు సెట్ అయ్యింది. ఈ క్రేజీ కాంబినేషన్ లో మూవీ రాబోతుందని అనౌన్స్ చేసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు అప్ డేట్స్ వస్తాయా అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు.

ఆమధ్య ఫస్ట్ షెడ్యూల్ ప్రారంభమైంది. అయితే.. చాలా తక్కువ రోజులు మాత్రమే షూటింగ్ చేశారు. దీనికి కారణం.. ఫుల్ స్టోరీ ఇంకా రెడీ కాలేదని… అందుచేత ఫుల్ స్టోరీ రెడీ చేసిన తర్వాతే షూటింగ్ చేద్దామని మహేష్ అన్నారని.. అందుకనే ఫస్ట్ షెడ్యూల్ రెండు మూడురోజులే చేసి ఆపేశారని వార్తలు వచ్చాయి. రీసెంట్ గా ఈ మూవీని పాన్ ఇండియా మూవీగా చేయాలి అనుకుంటున్నారని.. కథలో మార్పులు చేర్పులు చేయడం వలనే షూటింగ్ కి బ్రేక్ పడిందని టాక్ వినిపిస్తోంది. త్రివిక్రమ్ ఒక వైపున సొంత బ్యానర్లో వచ్చే సినిమాల పైన దృష్టి పెట్టడం .. మరో వైపున కొన్ని సినిమాలకి కథలను ఇస్తుండటం కారణంగా ఈ మూవీకి అనుకున్న టైమ్ కి ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయలేకపోయారనే టాక్ వినిపిస్తోంది.

అందుకనే మహేష్ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసిన తర్వాతే షూటింగ్ స్టార్ట్ చేద్దామన్నారని ఇండస్ట్రీలో ఇన్ సైడ్ టాక్. ఇలా టాక్ బయటకు వచ్చిన ప్రతిసారీ నిర్మాణ సంస్థ త్వరలోనే సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేస్తున్నాం అంటూ ప్రకటన ఇస్తుంది. ఇలా అనౌన్స్ మెంట్లు ఇచ్చినప్పటికీ ఈ మూవీ ఆగింది అంటూ వచ్చే వార్తలు మాత్రం ఆగడం లేదు. మొత్తానికి ఏదో జరుగుతుంది. మరి.. ప్రచారంలో ఉన్న వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టేలా… త్వరలోనే సెట్స్ పైకి వెళుతుందేమో చూడాలి.

Also Read : మహేష్‌ కథకి పాన్ ఇండియా కష్టాలు

RELATED ARTICLES

Most Popular

న్యూస్