Sunday, September 8, 2024
Homeసినిమామెగా ఫ్యాన్స్ ఆవేదన

మెగా ఫ్యాన్స్ ఆవేదన

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య‘.  మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో డైరెక్టర్ బాబీ  రూపొందిస్తోన్న ఈ మూవీలో రవితేజ కీలక పాత్ర పోషిస్తుండగా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. అయితే.. సంక్రాంతికి  ‘వాల్తేరు వీరయ్య’ పాటు నందమూరి బాలకృష్ణ ‘వీర సింహారెడ్డి’ కూడా  విడుదలవుతోంది.అయితే ఈ సినిమాకు కూడా మైత్రీ మూవీ మేకర్సే  నిర్మిస్తుండడం   విశేషం.  ఇద్దరు హీరోల  ఫ్యాన్స్ తో ఎక్కడ ఇబ్బంది వస్తుందో నని నిర్మాతలు కూడా వీలయినంత జాగ్రత్తగా వెళ్తున్నారు. అయినా.. మెగా ఫ్యాన్స్ లో మైత్రీ మూవీ మేకర్స్ పై అసంతృప్తి  పెరుగుతూ వస్తోంది. తమ అభిమాన హీరో సినిమాని అంతగా ప్రమోట్ చేయడం లేదని  ఆగ్రహాంతో ఉన్నారు. అయితే.. బేగంపేట టూరిజం ప్లాజా హొటల్ లో సుమారు 400 మంది మెగా ఫ్యాన్స్ సమావేశమయ్యారు. మైత్రీ నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.

మెగాస్టార్ సినిమా ప్రచారం విషయంలో శ్రద్ద పెట్టడం లేదన్నది ఫ్యాన్స్ ప్రధాన ఆరోపణ. అలాగే థియేటర్ల విషయంలో ఇంకా క్లారిటీ లేదని చాలా చోట్ల ‘వారసుడు’, ‘వీరసింహారెడ్డి’కి మంచి థియేటర్ల పడుతున్నాయని కొందరు తెలియచేశారు. మెగాస్టార్ సినిమాకు ఏం చేస్తే బాగుంటుదని తాము అనుకుంటున్నామో, అవన్నీ బాలయ్య సినిమాకు అమలు అవుతున్నాయని ఫ్యాన్స్ తమ మనసులో మాటలను బయటపెట్టారు. అయితే.. ఫ్యాన్స్ కు మైత్రీ రవి సమాధానం ఇస్తూ, సినిమా అద్భుతంగా వచ్చిందని, ఇంద్ర లాంటి రేంజ్ సినిమా అని, పబ్లిసిటీ, థియేటర్ల ప్లానింగ్ పై ఫ్యాన్స్ కు ఆందోళన అవసరం లేదని నచ్చజెప్పారు. మరి.. వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తాడో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్