Thursday, June 11, 2026
HomeTrending Newsగుంటూరు జిల్లా జైలుకు రఘురామకృష్ణంరాజు

గుంటూరు జిల్లా జైలుకు రఘురామకృష్ణంరాజు

నర్సాపురం ఎంపి రఘురామకృష్ణంరాజును గుంటూరు జిజిహేచ్ నుంచి జిల్లా జైలుకు తరలించారు.  నేటి ఉదయం నుంచి రఘురామకు 18 రకాల వైద్య పరిక్షలు నిర్వహించారు. అనంతరం వైద్య నివేదికను జిల్లా మేజిస్ట్రేట్ కు వైద్యుల కమిటి అందజేసింది.

కాసేపట్లో జిల్లా మేజిస్ట్రేట్ ఈ నివేదికను హైకోర్టు డివిజన్ బెంచ్ కు అందజేయనుంది. ఈ నివేదిక పరిశీలించిన తర్వాతా హైకోర్టు బెంచ్ ఈ కేసులో తుది తీర్పు ఇవ్వనుంది. రఘురామ అనారోగ్యంతో బాధపడుతున్నారని, పోలీసులు ఆయన్ను గాయపరిచారని, మెరుగైన వైద్యం కోసం రమేష్ ఆస్పత్రికి తరలించాలని అయన తరపు న్యాయవాదులు హైకోర్టును అభ్యర్ధించారు.

సామాజికవర్గాల మధ్య ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా మాట్లాడారని ఎంపీ రఘురామపై ఐ పి సి 124B సెక్షన్ కింద ఎపి సిఐడి అభియోగం మోపిన సంగతి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular