Sunday, September 22, 2024
Homeసినిమాచైతు, పరశురామ్ మూవీ స్టోరీ ఇదే

చైతు, పరశురామ్ మూవీ స్టోరీ ఇదే

నాగచైతన్య, పరశురామ్ కాంబినేషన్లో ఓ భారీ చిత్రం రానుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ‘గీత గోవిందం’ తర్వాత పరశురామ్ నాగచైతన్యతో సినిమా చేయాలి. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో ఈ సినిమాని అఫిసియల్ గా అనౌన్స్ చేయడం కూడా జరిగింది. అయితే.. అనుకోకుండా అప్పుడు పరశురామ్ కి మహేష్‌ బాబుతో సినిమా చేసే ఛాన్స్ రావడంతో నాగచైతన్యతో సినిమాను పక్కనపెట్టి మహేష్‌ తో ‘సర్కారు వారి పాట’ సినిమా చేశాడు. ఆతర్వాత వెంటనే నాగచైతన్యతో సినిమా చేద్దామనుకుంటే… నాగచైతన్య బిజీ అయ్యాడు.

నాగచైతన్య ప్రస్తుతం వెంకట్ ప్రభు డైరెక్షన్ లో ‘కస్టడీ’ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఎవరితో సినిమా చేయాలి అనేది నాగచైతన్య ఇంకా కన్ ఫర్మ్ చేయలేదు. అయితే.. పరశురామ్ నాగచైతన్య కోసం ఓ డిఫెరెంట్ బ్యాక్ డ్రాప్ తో స్టోరీ రెడీ చేస్తున్నారని తెలిసింది. శ్రీకాకుళం జిల్లా బ్యాక్ డ్రాప్ లో ఓ కథ అల్లుకున్నట్లు సమాచారం. విశాఖ జిల్లాలో వున్న సీలేరు బ్యారేజ్ బ్యాక్ డ్రాప్ లో కథ అల్లుకున్నారని తెలుస్తోంది. అయితే.. మరి సినిమాలో విశాఖ జిల్లాలో సీలేరు బ్యారేఙ్ బ్యాక్ డ్రాప్ అని చూపిస్తారా లేదా రాండమ్ గా ఏదో ఏరియాలో బ్యారేజ్ బ్యాక్ డ్రాప్ అని సెట్ చేస్తారా అన్నది తెలియాల్సివుంది.

ప్రస్తుతానికి నాగ్ చైతన్య లైన్ అయితే ఓకె చేసాడు. ఆ లైన్ పట్టుకుని కథ తయారు చేసే పనిలో పరుశురామ్ సీరియస్ గా వర్క్ చేస్తన్నారట. ప్రస్తుతం సరైన ప్రాజెక్టు, సరైన హిట్ కోసం చూస్తున్న 14 రీల్స్ ప్లస్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది. కస్టడీ మూవీ కంప్లీట్ అయిన తర్వాత ఈ సినిమా మొదలయ్యే అవకాశం వుంది. పరుశురామ్ కనుక తన ఫుల్ స్క్రిప్ట్ తో చైతన్యను మెప్పించగలిగితే. ఈ సినిమా సెట్స్ పైకి వస్తుంది. లేదంటే.. లేనట్టే. మరి.. ఎప్పటి నుంచో వార్తల్లో ఉన్న ఈ కాంబో మూవీ సెట్ అవుతుందో లేదో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్