Monday, September 30, 2024
Homeసినిమాప్ర‌భాస్‌.. మారుతి.. మూవీ ఆగిపోయిందా..?

ప్ర‌భాస్‌.. మారుతి.. మూవీ ఆగిపోయిందా..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ఆదిపురుష్‌, సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలు చేస్తున్నారు. వీటితో పాటు అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ అనే సినిమా చేయడానికి ఓకే చెప్పాడు. అయితే.. ఇంత బిజీగా ఉన్నప్పటికీ.. ఎవరూ ఊహంచని విధంగా మారుతితో సినిమా చేయడానికి ఓకే చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు.  ఓకే చెప్పడమే కాదు.. షూటింగ్ కూడా స్టార్ట్ చేశాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ దీన్ని నిర్మిస్తోంది. ఇది హర్రర్ కామెడీ మూవీ అని టాక్ వచ్చింది. ఇటీవల ఈ ఈ షూటింగ్ కి సంబంధించి ఓ స్టిల్ బయటకు వచ్చింది.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ మూవీ ఆగిపోయిందని ప్రచారం మొదలైంది. కారణం ఏంటంటే.. ఆదిపురుష్‌, సలార్, ప్రాజెక్ట్ కే.. ఇలా భారీ చిత్రాలు చేస్తున్న ప్రభాస్ వీటి మధ్యలో ‘హర్రర్’ మూవీ రిలీజ్ చేస్తే బాగోదని.. తన సినిమా రిలీజ్ అయ్యేవరకు ఆ సినిమాను రిలీజ్ చేయకూడదని ప్రాజెక్ట్ కే నిర్మాత అశ్వనీదత్ కండిషన్ పెట్టారని.. అందుచేత మారుతితో మూవీ ఆగిపోయిందని.. ఇంక ఎప్పటికీ  సెట్స్ పైకి రాదని టాలీవుడ్ లో టాక్ గట్టిగా వినిపిస్తోంది. మరో వైపు ప్రచారంలో ఉన్న వార్త వాస్తవం కాదని, కొత్త షెడ్యూల్ ఫిబ్రవరిలో స్టార్ట్ కానుందని కూడా వార్తలు వస్తున్నాయి.

ఈసారి ప్ర‌భాస్ ఎక్కువ కాల్షీట్లు కేటాయించాడట. ఈ నెలాఖ‌రులోగా.. స‌లార్‌ సినిమా పూర్త‌వ‌బోతోంది. అందుకే… మారుతి సినిమాపై ప్ర‌భాస్ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాడు. ఫిబ్ర‌వ‌రి నుంచి నెల‌కు 15 రోజుల పాటు కేవ‌లం మారుతి సినిమకే కేటాయించాల‌న్న నిర్ణ‌యం తీసుకొన్నాడట. సో.. ఫిబ్ర‌వ‌రి నుంచినాన్ స్టాప్ గా షూటింగ్ జ‌రుపుకోనుంది. ఇప్ప‌టి వ‌ర‌కూ తీసిన ర‌షెష్ ప‌ట్ల‌ ప్రభాస్ పూర్తి సంతృప్తిలో ఉన్నాడ‌ని టాక్. మారుతి స్పీడు, సెట్లో క్లారిటీ ప్రభాస్ కి బాగా న‌చ్చింద‌ని, దాంతో మిగిలిన సినిమాల్ని సైతం ప‌క్క‌న పెట్టి మారుతి సినిమాని త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయాల‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. మరి.. ఈ మూవీ రిలీజ్ పై క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్