Thursday, April 25, 2024
Homeస్పోర్ట్స్ప్రొ కబడ్డీ: పూణే, ముంబై విజయం  

ప్రొ కబడ్డీ: పూణే, ముంబై విజయం  

Pro Kabaddi: వివో ప్రో కబడ్డీ లీగ్ లో నేటి మ్యాచ్ ల్లో పూణే, యూముంబా విజయం సాధించగా జైపూర్-తమిళ్ మ్యాచ్ టై గా ముగిసింది.

పునేరి పల్టాన్ – బెంగుళూరు బుల్స్  జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్ ను 37-35తో పూణే గెల్చుకుంది, తొలి అర్ధ భాగంలో 16-15 తో స్వల్ప ఆధిక్యం సంపాదించిన పూణే రెండో అర్ధభాగంలోనూ  18-14 తో అదే ఆధిక్యం నిలబెట్టుకుంది. చివరకు రెండు పాయింట్ల తేడాతో విజయం సాధించింది. పూణే ఆటగాడు మోహిత్ గయట్-13 ; బెంగుళూరు కెప్టెన్ పవన్ షెరావత్-10 పాయింట్లు సాధించారు.

యూ ముంబా- తెలుగు టైటాన్స్ జట్ల మధ్య జరిగిన రెండో మ్యాచ్ లో  ముంబై 42-35 తేడాతో విజయం సాధించింది. తొలి అర్ధ భాగంలో 23-17తో ముందంజలో నిలిచిన ముంబై ద్వితీయార్ధంలో కూడా రాణించి 19-18 తో ఆధిక్యం ప్రదర్శించింది. చివరకు ఏడు పాయింట్ల తేడాతో విజయం ముంబైని వరించింది. ముంబై ఆటగాడు అభిషేక్ సింగ్ 15పాయింట్లతో రాణించాడు.

జైపూర్ పింక్ పాంథర్స్ – తమిళ్ తలైవాస్  జట్ల మధ్య హోరాహోరీగా జరిగిన మూడో మ్యాచ్ 34-34 తో డ్రా గా ముగిసింది. తొలి అర్ధ భాగంలో 20-18తో తలైవాస్ ముందంజలో నిలిచింది. ద్వితీయార్ధంలో రెండు జట్లూ నువ్వా-నేనా అన్నట్లు ఆడాయి. ఓ దశలో జైపూర్ ఆధిక్యంలోకి వచ్చింది, ఆ తరువాత మళ్ళీ తమిళ్ పుంజుకుంది, చివరకు 16-14 తో జైపూర్ ఆధిక్యం ప్రదర్శించింది. దీనితో ఈ మ్యాచ్ టై గా ముగిసింది.

నేటి మ్యాచ్ లు పూర్తయిన తరువాత దబాంగ్ ఢిల్లీ (43 పాయింట్లు); బెంగుళూరు బుల్స్ (41); పాట్నా పైరేట్స్ (40); యూపీ యోధ (38); యూ ముంబా (36); బెంగాల్ వారియర్స్ (36) జట్లు టాప్ సిక్స్ లో ఉన్నాయి.

Also Read : ప్రొ కబడ్డీ:  హర్యానా, యూపీ విజయం

RELATED ARTICLES

Most Popular

న్యూస్