Friday, October 18, 2024
Homeసినిమాఅమితాబ్, రజినీ భారీ మల్టీస్టారర్. ఇంతకీ కథ ఏంటి..?

అమితాబ్, రజినీ భారీ మల్టీస్టారర్. ఇంతకీ కథ ఏంటి..?

అమితాబ్, రజినీకాంత్ కలిసి సినిమా చే్స్తే.. అభిమానులకు పండగే అని చెప్పచ్చు. వీరిద్దరూ కలిసి ఇప్పటి వరకు మూడు హిందీ సినిమాల్లో నటించారు. అవును.. తొలిసారి అమితాబ్, రజినీకాంత్ కలిసి 1983లో అంథా కానూన్ అనే సినిమాలో కలిసి నటించారు. ఆతర్వాత 1985లో ‘గిరఫ్తార్’ అనే మూవీలో నటించారు. ఈ సినిమా తర్వాత మూడోసారి 1991లో హమ్ అనే సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. ఆతర్వాత మళ్లీ కలిసి నటించలేదు. ఇప్పుడు ఈ క్రేజీ కాంబో సెట్ అయ్యిందని సమాచారం.

ముప్పై రెండేళ్ల తర్వాత రజినీ, బిగ్ బి కలిసి నటిస్తుండడం విశేషం. రజినీకాంత్ హీరోగా జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేల్ డైరెక్షన్ లో ఓ సినిమా తెరకెక్కనుంది. రజినీకాంత్ కెరీర్ లో ఇది 170వ చిత్రం. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం అమితాబ్ ను కాంటాక్ట్ చేశారట. దీనికి అమితాబ్ వెంటనే ఓకే చెప్పారట. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి అమితాబ్ అభిమానులు, రజినీ అభిమానలు మాత్రమే కాదు… సినీ అభిమానులు అందరూ ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా..? అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

అలాగే అసలు ఈ సినిమా కథ ఏంటి..? వీరిద్దరూ ఎలాంటి పాత్రలు పోషించనున్నారు..? అనేది ఆసక్తిగా మారింది. అయితే…  కొన్ని యద్థార్థ సంఘటనలు ఆధారంగా ఈ సినిమా రూపొందుతుందని తెలిసింది. ఇందులో రజినీకాంత్ పోలీసాఫీసర్ గా నటించనున్నారని సమాచారం. అమితాబ్ పాత్ర ఏంటి అనేది బయటకు రాలేదు కానీ.. వీరిద్దరి పై వచ్చే సన్నివేశాలు మాత్రం అభిమానులుకు థ్రిల్ కలిగించేలా ఉంటాయని అంటున్నారు. ఈ చిత్రాన్ని ఏమాత్రం రాజీపడకుండా సుభాస్కరన్ నిర్మించనున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు. వచ్చే సంవత్సరం ఈ క్రేజీ మూవీని విడుదల చేయనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్