Friday, March 29, 2024
Homeస్పోర్ట్స్ప్రొ కబడ్డీ: ఢిల్లీ గెలుపు, టైటాన్స్ కు మరో ఓటమి

ప్రొ కబడ్డీ: ఢిల్లీ గెలుపు, టైటాన్స్ కు మరో ఓటమి

Pro Kabaddi: వివో ప్రో కబడ్డీ లీగ్ లో నేటి మ్యాచ్ ల్లో ఢిల్లీ, యూపీ  తమ ప్రత్యర్థులపై విజయం సాధించాయి.

దబాంగ్ ఢిల్లీ – హర్యానా స్టీలర్స్ మధ్య జరిగిన తొలి మ్యాచ్ లో 28-25 తో ఢిల్లీ విజయం సాధించింది. తొలి అర్ధ భాగంలో 11-11  తో ఇరు ట్లూ సమంగా నిలిచాయి. రెండో అర్ధభాగంలో ఢిల్లీ17-14 తో ఆధిక్యం ప్రదర్శించి 3 పాయింట్లతో గెలుపు సాధించింది.

యూపీ యోధ – తెలుగు టైటాన్స్  జట్ల మధ్య జరిగిన రెండో మ్యాచ్ లో యూపీ 39-33 తేడాతో విజయం సాధించింది. తొలి అర్ధ భాగంలో 19-14తో ముందంజలో ఉన్న యూపీ  ద్వితీయార్ధంలో కూడా రాణించి 20-19 తో ఆధిక్యం ప్రదర్శించింది. చివరకు ఆరు పాయింట్ల తేడాతో విజయం యూపీని  వరించింది.

యూ ముంబా – బెంగాల్ వారియర్స్  జట్ల మధ్య జరిగిన మూడో మ్యాచ్ 32-32 తో డ్రా గా ముగిసింది. తొలి అర్ధ భాగంలో 19-17 తో ముందంజలో ఉన్న బెంగాల్   ద్వితీయార్ధంలో అదే రెండు పాయింట్లు వెనకబడింది. ముంబై 15-13 తో ఆధిక్యం సంపాదించింది. దీంతో మ్యాచ్ టై గా ముగిసింది. బెంగాల్ కెప్టెన్ మణీందర్ సింగ్ 17 పాయింటు సాధించి రాణించాడు.

నేటి మ్యాచ్ లు పూర్తయిన తరువాత బెంగుళూరు బుల్స్ (38 పాయింట్లు); దబాంగ్ ఢిల్లీ (37); పాట్నా పైరేట్స్ (34); యూపీ యోధ (28); జైపూర్ పింక్ పాంథర్స్ (28); యూ ముంబా(28); జట్లు టాప్ సిక్స్ లో ఉన్నాయి.

Also Read : ప్రొ కబడ్డీ: సత్తా చాటిన బెంగుళూరు, జైపూర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్