Friday, September 20, 2024
HomeTrending NewsKarimnagar: కరీంనగర్ లో ఎన్‌ఐఏ సోదాలు

Karimnagar: కరీంనగర్ లో ఎన్‌ఐఏ సోదాలు

కరీంనగర్ లో ఈ రోజు (గురువారం) తెల్లవారు జాము నుంచి ఎన్.ఐ.ఏ సోదాలు నిర్వహిస్తోంది. హుస్సేనీపురలో ఉంటుంటున్న నిషేధిత పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (PFI) చెందిన ఓ కీలక నేత తబ్రేజ్  ఇంట్లో గురువారం ఉదయం నుంచి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీలలో ఎన్ఐఏతోపాటు, స్థానిక పోలీసులు కూడా పాల్గొన్నారు.

కరీంనగర్ పట్టణంలో ఎన్ఐఏ అధికారుల సోదాలు కలకలం సృష్టించాయి. ఉదయం నుంచి సుమారు ఐదు గంటలుగా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. పలు కీలక డ్యాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల సమయంలో ఆ ఇంట్లో తబ్రేజ్  లేరని తెలుస్తున్నది. విదేశాల్లో ఉంటున్నట్లు అధికారులు గుర్తించారు. హుస్సేనీపురతోపాటు కార్ఖానాగడ్డ, నాకా చౌరస్తాలోని పలు ఇండ్లలో తనిఖీలు నిర్వహించారు. ఈ క్ర‌మంలో ఒకరిని అదుపులోకి తీసుకున్నట్టు స‌మాచారం అందుతోంది.. దీనికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్