Sunday, September 8, 2024
HomeTrending Newsముగ్గురు బీ.ఆర్.ఎస్ ఎమ్మెల్సీలు ఏకగ్రీవం

ముగ్గురు బీ.ఆర్.ఎస్ ఎమ్మెల్సీలు ఏకగ్రీవం

ఎమ్మెల్యే కోటా లో కె.నవీన్ కుమార్, దేశపతి శ్రీనివాస్, చల్లా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవ ఎన్నికయ్యారు. ఈ మేరకు ముగ్గురు బీ.ఆర్.ఎస్ ఎమ్మెల్సీలు రిటర్నింగ్ అధికారి నుంచి ఈ రోజు ఎన్నిక ధ్రువీకరణ పత్రం తీసుకున్నారు. ఎన్నిక ధ్రువీకరణ పత్రం స్వీకరణ కార్యక్రమంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమానికి పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.

ఈ నెల 9న రాష్ట్ర శాసనమండలికి ఎమ్మెల్యేల కోటా బీఆర్ఎస్ అభ్యర్థులుగా దేశపతి శ్రీనివాస్, కుర్మయ్యగారి నవీన్ కుమార్, చల్లా వెంకట్రామి రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ ఆవరణలో రిటర్నింగ్ అధికారికి తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్