Sunday, September 22, 2024
HomeTrending Newsసదరన్ కౌన్సిల్ మీటింగ్ ప్రారంభం

సదరన్ కౌన్సిల్ మీటింగ్ ప్రారంభం

Southern Zonal Council Meet:
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం  ప్రారంభమైంది. ఈ కౌన్సిల్ కు అమిత్ షా చైర్మన్ గా ఉండగా, వైస్ చైర్మన్ గా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నారు. తిరుపతిలోని తాజ్ హోటల్ లో జరుతుతున్న ఈ సమావేశానికి కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగ స్వామి, తెలంగాణ నుంచి హోంశాఖ మంత్రి మహమూద్ అలీ హాజరయ్యారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. లక్షద్వీప్, అండమాన్ అండ్ నికోబార్ లెఫ్టినెంట్ గవర్నర్లు  ప్రఫుల్ పటేల్, దేవేంద్ర కుమార్ జోషి కూడా హాజరయ్యారు.  మొత్తం 29అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్