Tuesday, September 24, 2024
Homeసినిమాఆది కొత్త సినిమా. అదే బ్యానర్... సేమ్ డైరెక్టర్

ఆది కొత్త సినిమా. అదే బ్యానర్… సేమ్ డైరెక్టర్

Nagam with Aadi: యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో ఆది సాయి కుమార్‌ హీరోగా తెరకెక్కిన ‘తీస్ మార్ ఖాన్’ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. విజ‌న్ సినిమాస్ బ్యాన‌ర్ పై నాగం తిరుప‌తి రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు నాటకం ఫేమ్ కళ్యాణ్ జి గోగణ దర్శకత్వం వహించారు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో ఆది సాయి కుమార్ సరసన పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటిస్తోంది. సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

అయితే నేడు (డిసెంబర్ 25) నిర్మాత నాగం తిరుప‌తి రెడ్డి పుట్టిన రోజు బర్త్ డే వేడుకను విజన్ సినిమాస్ ఆఫీసులో తీస్ మార్ ఖాన్ టీమ్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆది సాయి కుమార్, సునీల్‌లతో పాటు తీస్ మార్ ఖాన్ మూవీ యూనిట్ అంతా పాల్గొంది. ఈ సందర్భంగా విజ‌న్ సినిమాస్ నుంచి మరో మూవీ అనౌన్స్ చేశారు. ఓ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగానే కాన్ఫిడెన్స్‌ తో అదే బ్యానర్ నుంచి మరో సినిమా అనౌన్స్ చేయడం విశేషం.

ఈ సందర్భంగా నాగం తిరుపతి రెడ్డి మాట్లాడుతూ “ఇప్పటికే తీస్ మార్ ఖాన్ షూటింగ్ కంప్లీట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ సినిమా రషెస్ చూశాక తీస్ మార్ ఖాన్ సూపర్ డూపర్ హిట్ అవుతుందనే నమ్మకం వచ్చింది. చిత్రంలోని సన్నివేశాలు ఎంతో బాగా వచ్చాయి. ఖచ్చితంగా ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. త్వరలోనే ఈ సినిమాను గ్రాండ్‌గా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం. నా తదుపరి సినిమాకు కూడా దర్శకుడు కళ్యాణ్ జి గోగణతో, ఆది సాయి కుమార్‌‌తో కలిసి పని చేయబోతుండటం చాలా ఆనందంగా ఉంది. ఇక పై ఆదితో ప్రతి ఏడాది ఓ సినిమా చేసే ప్లాన్ చేస్తాను. ఈ విజన్ సినిమాస్ ప్రొడక్షన్ నెం 4కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం” అన్నారు.

ఆది సాయి కుమార్ మాట్లాడుతూ. “ముందుగా నిర్మాత నాగం తిరుప‌తి రెడ్డి గారికి ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నాను. నాగం తిరుప‌తి రెడ్డి, కళ్యాణ్ జి గోగణలతో ‘తీస్ మార్ ఖాన్’ సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. సెట్స్ పై ఎంజాయ్ చేస్తూ షూటింగ్ ఫినిష్ చేశాం. దర్శక నిర్మాతలు చాలా సపోర్ట్ చేస్తూ అవుట్‌‌పుట్ విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గకుండా ముందుకెళ్లారు. విజన్ సినిమాస్ ప్రొడక్షన్ నెం 4 రూపంలో మరోసారి అదే టీమ్‌తో కలిసి పని చేయనుండటం ఆనందంగా ఉంది” అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్