Saturday, July 27, 2024
HomeTrending NewsFree Power: ఉచిత విద్యుత్ ఆలోచన కాంగ్రెస్ పార్టీదే - ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

Free Power: ఉచిత విద్యుత్ ఆలోచన కాంగ్రెస్ పార్టీదే – ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ అందించింది కాంగ్రెస్ పార్టీ అని కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి తెలిపారు.
రైతు బంధు, ఉచిత విధ్యుత్ పై కాంగ్రెస్ పార్టీ విధానాన్ని ఎన్ఆర్ఐలతో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి చిట్ చాట్ లో మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో ఉచిత విద్యుత్ ఏ మేరకు అవసరమో వివరిస్తే దాన్ని బీఆర్ఎస్ నాయకులు వక్రీకరించారని మాజీ మంత్రి, పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి మండిపడ్డారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను బీఆర్ఎస్ నాయకులు వక్రీకరించారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తప్పుబట్టారు. ఉచిత విద్యుత్ ఆలోచన కాంగ్రెస్ పార్టీదని స్పష్టం చేశారు. రైతుల ఆర్థిక భారం పడకుండా ఆదుకోవాలని సంకల్పంతో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా ప్రారంభించామన్నారు.

దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా మొట్ట మొదటి సంతకం ఉచిత విద్యుత్ ఫైలు పై చేశారనీ గుర్తు చేశారు. ఉచిత విద్యుత్ ఇస్తే బట్టలు ఆరేసుకోవాలని ఎద్దేవా చేసిన నాయకుల చెంప చెల్లుమానేలా వైఎస్ చేసి చూపెట్టాడని తెలిపారు. పదేళ్లపాటు రెండు దశల్లో 9 గంటల నాణ్యమైన విద్యుత్ అందించామని పేర్కొన్నారు. తెలంగాణలో ట్రాన్స్ఫార్మర్ వారీగా ఏ మేరకు 24 గంటలు విధ్యుత్ సరఫరా చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే రైతులు రొడ్డేక్కితేగానీ రిపేర్ చేయలేదనీ గుర్తు చేశారు.

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను వక్రరీకరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వరంగల్ డిక్లరేషన్ లో పేర్కొన్నట్లు రైతు బంధు పటిష్టంగా అమలు చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2400 మెగా వాట్ల విధ్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోని అన్ని రకాల రాయితీలను పునరుద్ధరిస్తామని, వరికి మద్దతు ధరకు అనుగుణంగా అదనంగా రు.500 కల్పిస్తామని అన్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు వక్రీకరించి, నిరసనలు చేస్తారా అని బీఆర్ఎస్ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణ మాఫీ చేయనందుకు, వడ్డీ రాయితీ నిలిపి వేసినందుకు ధర్నాలు చేయమంటారా అని బీఆర్ఎస్ నాయకుల తీరుపై చురకలంటించారు. 24 గంటలు నాణ్యమైన విద్యుత్ కల్పించడం కాంగ్రెస్ బాధ్యతగా తీసుకుంటుందన్నారు. విద్యుత్ యూనిట్ కు రు.4 ఉంటే, యూనిట్ కు రు.16చొప్పున కొనుగోలు చేస్తూ రాష్ట్ర ప్రజల పై భారం వేస్తున్నారని జీవన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర విభజన చట్టంలో 4వేల మెగా వాట్లా విద్యుత్ ఉత్పత్తికి కేంద్రం అనుమతి ఇస్తే, పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి సాధించలేని సీఎంకు మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు అవాకులు చెవాకులు మాట్లాడితే ప్రజలు హర్షించరని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్