Friday, March 20, 2026
HomeTrending Newsభద్రాచలం వద్ద నిలకడగా గోదావరి

భద్రాచలం వద్ద నిలకడగా గోదావరి

భద్రాచలం వద్ద మూడవ ప్రమాద హెచ్చరిక స్థాయి 53 అడుగులు దాటి ప్రవహిస్తున్న గోదావరి 54.60 అడుగుల వద్ద ఉదయం 9 గంటల నుంచి నిలకడగా ఉంది. గత రెండు రోజులుగా మెల్లమెల్లగా పెరిగిన గోదావరి వరద అధికార యంత్రాంగాన్ని, గోదావరి పరివాహక గ్రామాల ప్రజలను హడలెత్తించింది. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు అంగుళం కూడా పెరగకుండా రెండు గంటలపాటు నిలకడగా ఉండటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఎగువ ప్రాంతంలోని పేరూరు వద్ద గోదావరి తగ్గుతుండగా, ప్రస్తుతం వర్షాలు, స్థానిక వరదలు లేకపోవడంతో భద్రాచలం వద్ద కూడా వరద ఈ మధ్యాహ్నం నుంచి తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం మూడవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. అయితే వరద 50 అడుగులకు తగ్గితే భద్రాచలం నుంచి చర్ల వైపుకి రాకపోకలు పునరుద్ధరించబడతాయి. ప్రస్తుతం రవాణ స్తంభణతో దుమ్మగూడెం, చర్ల మండలాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular