Monday, September 30, 2024
Homeసినిమాఈనెల 24న వస్తున్న `క‌ర‌ణ్ అర్జున్‌`

ఈనెల 24న వస్తున్న `క‌ర‌ణ్ అర్జున్‌`

Familiar Name: రెడ్ రోడ్ థ్రిల్ల‌ర్స్ ప‌తాకంపై అభిమన్యు, నిఖిల్ కుమార్, షిఫా హీరో హీరోయిన్లుగా మోహ‌న్ శ్రీవ‌త్స ద‌ర్శ‌క‌త్వంలో డా.సోమేశ్వ‌ర‌ రావు పొన్నాన, బాలక్రిష్ణ ఆకుల, సురేష్ ,రామకృష్ణ, క్రాంతి కిరణ్  లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం `క‌ర‌ణ్ అర్జున్‌`.ఈ  చిత్రానికి  ర‌వి మేక‌ల ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌.  అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 24 న గ్రాండ్ గా 186 థియేటర్స్ లలో విడుదల అవుతున్న సందర్బంగా చిత్ర యూనిట్  హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ లో  ప్రి రిలీజ్ ట్రైలర్ ను లాంచ్ చేశారు.

అనంతరం చిత్ర దర్శకుడు మోహన్ శ్రీవత్స మాట్లాడుతూ…” మహాభారతం లోని కర్ణుడు , అర్జునుడి ఎమోషన్స్ లైన్ తీసుకొని సాంకేతికంగా ఇప్పుడున్న జనరేషన్ కు తగ్గట్టు మలుస్తూ తెరకేక్కించిన ఈ చిత్రంలోని  ప్రతి సీన్ ఎంటర్ టైన్ చేస్తుంది. మంచి లొకేషన్స్ కొరకు పాకిస్థాన్ బార్డర్ లో ఎంతో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ షూట్ చేశాము. ప్ర‌తి స‌న్నివేశం ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ఉంటుంది. ఈ సినిమాలో ఆర్టిస్టులు కొత్తవారని చూడకుండా ప్రేక్షకులకు మంచి కంటెంట్ ఇవ్వాలని కంటెంట్ ని న‌మ్ముకుని చేసిన సినిమా ఇది“.

మా సినిమాను నమ్మి థియేట‌ర్ కు వచ్చిన ప్రతి ప్రేక్షకుడిని నిరుత్సాహపరచకుండా అందరినీ ఎంట‌ర్ టైన్ చేస్తుంది. నచ్చుతుంది. నిర్మాతలు నాకు ఎంతో సపోర్ట్ చేశారు. ఖర్చుకు వెనుకడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. న్యూ ట్యాలెంట్ ఉన్న వారు బయట చాలా మంది వున్నారు. వారందరికీ ఇలాంటి కొత్త నిర్మాతలు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాను మూడు పాత్ర‌ల‌తో రోడ్ థ్రిల్ల‌ర్ గా తెరకెక్కించాం.  మొదట ఈ సినిమాను తెలుగు రాష్ట్రాలలో మాత్రమే రిలీజ్ చెయ్యాలి అనుకున్నాము. కానీ సౌత్, రాష్టాలలో తో పాటు నార్త్ లో కూడా  మా సినిమాను ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు.

Also Read : `క‌ర‌ణ్ అర్జున్‌` ఫ‌స్ట్ లుక్ లాంచ్‌ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్