Wednesday, September 25, 2024
Homeసినిమాఅక్కినేని త్రయం నెక్ట్స్ ప్లాన్ ఏంటి..?

అక్కినేని త్రయం నెక్ట్స్ ప్లాన్ ఏంటి..?

అక్కినేని నాగార్జున  రీసెంట్ గా నటించిన ‘వైల్డ్ డాగ్’, ‘ది ఘోస్ట్’ చిత్రాలు ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి, ది ఘోస్ట్ గత అక్టోబర్ లో విడుదలైంది. వెంటనే కొత్త సినిమాని ప్రకటిస్తానన్నారు కానీ.. ఇంత వరకు ఈ సినిమా అనౌన్స్ చేయలేదు. ప్రస్తుతం నాగార్జున విదేశాల్లో ఉన్నారు. జూన్ రెండో వారంలో  నాగ తన కొత్త  సినిమా స్టార్ట్ చేస్తారు. జులై ఫస్ట్ వీక్ నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఇక నాగచైతన్య విషయానికి వస్తే.. కస్టడీ చిత్రం పై చాలా నమ్మకం పెట్టుకున్నాడు కానీ.. నిరాశ పరిచింది. దీంతో తదుపరి చిత్రం ఎవరితో అనేది ఇంకా నిర్ణయించుకోలేదు. ప్రస్తుతం కథలు వింటున్నాడు. ఒకరి ఇద్దరి దర్శకులు చెప్పిన కథలు విన్నాడు కానీ.. పైనల్ గా ఇంకా నిర్ణయం తీసుకోలేదు. నెక్ట్స్ వీక్ చైతూ తదుపరి చిత్రం గురించి క్లారిటీ వస్తుందని టాక్ వినిపిస్తుంది. చందూ మొండేటి, శివ నిర్వాణ లైన్ లో ఉన్నప్పటికీ వీరిద్దరూ కాకుండా మరో డైరెక్టర్ తో సినిమా చేయనున్నట్టుగా తెలిసింది.

‘ఏజెంట్’డిజాస్టర్ అవ్వడంతో అఖిల్ రెస్ట్ తీసుకోవడం కోసం దుబాయ్ వెళ్లాడు. హైదరాబాద్ తిరిగి వచ్చినప్పటికీ.. ఇంకా నెక్ట్స్ మూవీ గురించి అప్ డేట్ ఇవ్వలేదు. యువీ క్రియేషన్స్ లో సినిమా చేయాలనుకుంటున్నాడు. యువీ సంస్థ ఓ వైపు ఆదిపురుష్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. అలాగే అనుష్క, నవీన్ పొలిశెట్టిల సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో కూడా బిజీగా ఉన్నారు. అయినప్పటికీ అఖిల్ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేశారు. త్వరలోనే ఈ సినిమాని ప్రకటించనున్నారు. మరి.. వరుసగా ప్లాప్స్ ఇచ్చిన అక్కినేని హీరోలు నెక్ట్స్ మూవీస్ తో సక్సెస్ ట్రాక్ లోకి వస్తారేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్