Thursday, April 25, 2024
Homeస్పోర్ట్స్ప్రొ కబడ్డీ:  సెమీస్ కు యూపీ, బెంగుళూరు

ప్రొ కబడ్డీ:  సెమీస్ కు యూపీ, బెంగుళూరు

Pro Kabaddi: వివో ప్రో కబడ్డీ లీగ్ లో నేడు జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్ లలో పునేరి పల్టాన్ పై యూపీ యోధ; గుజరాత్ జెయింట్స్ పై బెంగుళూరు బుల్స్ విజయం సాధించి సెమీస్ లో అడుగు పెట్టాయి.

యూపీ యోధ – పునేరి పల్టాన్ జట్ల మధ్య జరిగిన మొదటి మ్యాచ్ లో 42-31తో యూపీ విజయం సాధింఛి సెమీఫైనల్లో అడుగుపెట్టింది. ఆట మొదటినుంచీ యూపీ యోధ పైచేయి ప్రదర్శించి ప్రథమార్థం ముగిసే నాటికి 25-17తో ఆధిక్యం సంపాదించింది. ద్వితీయార్థంలో కూడా అదే జోరు కొనసాగించి 17-14తో ముందంజలో నిలిచింది. పూర్తి సమయం ముగిసేనాటికి 11 పాయింట్ల ఆధిక్యంతో విజయం సాధించింది. యూపీ రైడర్ ప్రదీప్ నర్వాల్ 18 పాయింట్లు సంపాదించి సత్తా చాటి గెలుపులో కీలక భూమిక పోషించాడు.

బెంగుళూరు బుల్స్ – గుజరాత్ జెయింట్స్ జట్ల మధ్య జరిగిన రెండో మ్యాచ్ లో 49-29తో బెంగుళూరు ఘన విజయం సాధించి సెమీస్ లో ప్రవేశించింది. ఆట మొదటిభాగంలో 24-17 ఆధిక్యం సంపాదించిన బెంగుళూరు  రెండోభాగంలో అంతకుమించి అన్నట్లు ఆడి 25-12తో దూసుకు పోయింది.  మ్యాచ్ సమయం పూర్తయ్యే నాటికీ 20 పాయింట్ల ఆధిక్యాన్ని బెంగుళూరు సంపాదిన్చాగాలిగింది. బెంగుళూరు కెప్టెన్ పవన్ షెరావత్ 13 పాయింట్లతో  ఈ కీలక మ్యాచ్ లో కూడా రాణించాడు.

ఎల్లుండి ఫిబ్రవరి 23 న జరిగే తొలి సెమి ఫైనల్లో యూపీ యోధ జట్టు పాట్నా పైరేట్స్ తోను;  బెంగుళూరు బుల్స్…దబాంగ్ ఢిల్లీ తోను తలపడనున్నాయి.

ఫిబ్రవరి 25న ఫైనల్ జరగనుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్