Friday, October 18, 2024
Homeసినిమాగీత ఆర్ట్స్ లో గుర్తుండిపోయే సినిమా - కిరణ్ అబ్బవరం

గీత ఆర్ట్స్ లో గుర్తుండిపోయే సినిమా – కిరణ్ అబ్బవరం

అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై రూపొందుతోన్న సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’. బ‌న్నీ వాసు నిర్మాత‌గా వ్యవహరిస్తున్నారు. జిఏ 2 పిక్చర్స్ బ్యానర్లో వస్తున్న సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’. ఇందులో కిరణ్‌ అబ్బవరం హీరోగా నటించారు. ఈ సినిమా ద్వారా మురళి కిషోర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా నిర్మాత బన్నీవాసు మాట్లాడుతూ… నెలకొక సినిమా రిలీజ్ చేస్తున్న కూడా బోర్ కొట్టకుండా మా సినిమాకి వస్తున్న ప్రేక్షక దేవుళ్ళుకు థాంక్యూ సో మచ్. మా ga2 బ్యానర్ ను నిర్మించినప్పుడు ఇది చాలా మందికి కొత్త దర్శకులకు ప్లాట్ఫ్రామ్ అవ్వాలి అనుకున్నాం. ఈ సినిమా కథ చెప్పినప్పుడే ఈ టైటిల్ ను చెప్పాడు దర్శకుడు. కథ మొత్తం అయిపోయిన తరవాత నన్ను ఈ డైరెక్టర్ అడిగాడు సర్ దీనిలో ఏమైనా దేవుడు ఎలిమెంట్ ఉంది అనుకుంటున్నారా అని. నేను ఉంది కదా అని చెప్పాను విష్ణు తత్త్వం క్లారిటీగా కనిపిస్తుంది. ఒక మనిషి యొక్క చిరునవ్వుని, అవతలవాడికి సాయం పడే విధానాన్ని ఇంత కమర్షియల్ గా చెప్పుకుంటూ వచ్చారు అని చెప్పాను. ఆ వెంటనే అతను సర్ అందుకే మీరు ఇంత మంచి ప్రొడ్యూసర్ అయ్యారు అని చెప్పాడు. అలాగే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన సాంగ్ కు కూడా ఇండస్ట్రీ పెద్దల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. ఆ స్టేజస్ పైన కూడా మంచి మాటలు మాట్లాడుకుందాం అన్నారు.

కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ… చాలా మంది యంగ్ మేకర్స్ కి అల్లు అరవింద్ గారు ఇన్స్పైరింగ్. గీత ఆర్ట్స్ లో ఏదైనా వర్క్ చేస్తే చాలు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన వాసు గారికి చాలా థాంక్యూ. గీతా ఆర్ట్స్ లో సినిమా చేయడం వేరు, వినరో భాగ్యము విష్ణు కథ సినిమా చేయడం వేరు. ఇలా ఎందుకు చెప్తున్నానో మీకు ఫిబ్రవరి 17న అర్ధమవుతుంది. గీత ఆర్ట్స్ లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది ఇది. ఈ సినిమాలోని డైలాగ్స్ అలా గుర్తుండిపోతాయి. సినిమా చాలా ఇంపాక్ట్ ఫుల్ గా ఉంటుంది. చైతన్ భరత్వాజ్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. టీజర్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఫిబ్రవరి 17న నాకు బాగా గుర్తుండిపోయే రోజు అవుతుంది అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్